విద్యార్థులకు నైతిక విలువలతో కూడిన విద్యను బోధించండి : ఎం ఈ ఓ వై ప్రభాకర్.

Published: Wednesday December 01, 2021
మధిర నవంబర్ 30 ప్రజాపాలన ప్రతినిధి : నేటి సమాజంలో మారుతున్న కాలాన్ని బట్టి విద్యార్థులకు నైతిక విలువలతో కూడిన విద్యను ఉపాధ్యాయులు బోధించాలని మండల విద్యాశాఖ అధికారి వై ప్రభాకర్ సూచించారు. మంగళవారం సిరిపురం కాంప్లెక్స్ లెవెల్ టిసి సమావేశాన్ని వంగవీటి పాఠశాలలో ఆ పాఠశాల హెచ్ఎం సత్యనారాయణ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఎంపిడిఓ మాట్లాడుతూ విద్యార్థులకు నైతిక విలువలతో కూడిన విద్యను  బోధించాలని సూచించారు. అదేవిధంగా పిల్లల హాజరు శాతాన్ని మెరుగు పరిచే విధంగా చూడాలని పాఠశాలలో కరోనా నియంత్రణ చర్యలు పాటించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, సి ఆర్ పి బాబు రావు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.