పార్టీ అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి

Published: Wednesday November 24, 2021
యాదాద్రి నవంబర్ 23 వలిగొండ ప్రజాపాలన ప్రతినిది భారతీయ జనతా పార్టీ అభివృద్ధికి ప్రతి కార్యకర్త ఓ సైనికునిలా కృషి చేయాలని బిజెపి రాష్ట్ర నాయకులు దాసరి మల్లేశం అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని సాయి గణేష్ ఫంక్షన్ హాలులో పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించి ఆయన పాల్గొని మాట్లాడుతూ మండల వ్యాప్తంగా బూత్ కమిటీలు, అనుబంధ కమిటీలు పూర్తి చేయాలని, ఈ కమిటీలకు ఇంచార్జీలను నియమించాలని, పార్టీ పటిష్టతకు ప్రతి కార్యకర్త ఓ సైనికునిలా కృషి చేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఇంచార్జి చందా మహేందర్ గుప్తా, జిల్లా ఉపాధ్యక్షులు దంతూరి సత్తయ్య, మండల పార్టీ అధ్యక్షుడు నాగేల్లి సుధాకర్, రాష్ట్ర నాయకులు బందారపు లింగస్వామి, నాయకులు రాచకొండ కృష్ణ, బచ్చు శ్రీనివాస్, మారోజు అనిల్ కుమార్, వెలిమినేటి వెంకటేశం, వట్టిపల్లి సంతోష్, మంద నర్సింహా, పాక పుల్లయ్య, రేగూరి అమరెందర్, చిన్నం అంజమ్మ, దయ్యాల వెంకటేష్, మైసోళ్ల నర్సింహా, గండికోట హరీష్, సోమ నవీన్ తదితరులు పాల్గొన్నారు.