కోటిలింగాల హూండీ ఆదాయం 2,78,267, : ఆలయ ఇన్స్పెక్టర్ రవి కిషోర్

Published: Wednesday November 24, 2021

వెల్గటూర్, నవంబర్ 23 (ప్రజాపాలన ప్రతినిధి) : వెల్గటూర్ మండలం కోటిలింగాల శ్రీ కోటేశ్వర స్వామి దేవస్థానం హుండీ ఆదాయం 2,78,267/- రూపాయలు వచ్చినట్లు ఆలయ ఇన్స్పెక్టర్ రవి కిషోర్ మరియు కార్యనిర్వహణాధికారి  మారుతీరావు, చైర్మన్ నారాయణ రావు తెలియజేశారు. ఎనిమిది నెలలకు గాను దేవస్థానం హుండీ ఆదాయం ఇతర టిక్కెట్ల ద్వారా ఈ ఆదాయం వచ్చినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజి ధర్మకర్తలు కనపర్తి సుధాకర్ రావు, కళావతి, కోటిలింగాల సర్పంచ్ మౌనికరవితేజ, హర్ష శ్రీ డిగ్రీ కళాశాల విద్యార్థులు మరియు అర్చకులు బొడవెళ్లి సంజీవ్, మోగిలిపాలెం నాగరాజు పాల్గొన్నారు.