బాలీవుడ్ లో తెలుగు జ్యోతిష్యులకు పెరుగుతున్న ఆదరణ
Published: Wednesday November 24, 2021
హైదరాబాద్(ప్రజాపాలన ప్రతినిధి) : హిందీ చిత్ర పరిశ్రమలో తెలుగు జ్యోతిష్యులకు మంచి ఆదరణ లభిస్తుందని ప్రముఖ ఆస్ట్రో బాలు మున్నంగి అన్నారు. ఈ సందర్భంగా బంజారాహిల్స్ లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సినిమా టైటిల్ కార్డ్స్ లో వేసే పేర్లలో 24 శాఖలతో పాటు ఇప్పుడు జ్యోతిష్యాన్ని కూడా జతపరచడం హర్షణీయమన్నారు. ఇటీవలికాలంలో అమెజాన్ ప్రైమ్ వీడియో లో విడుదలైన షేర్ష సినిమాతో పాటు కరణ్ జోహార్, అజయ్ దేవగన్, సంజయ్ దత్, సిద్ధార్థ్ మల్హోత్రా వంటి ఎంతో మంది ప్రముఖ నటులు నటించిన సినిమాలకు ప్రారంభోత్సవాలకు ముహూర్తాలను నిర్ణయించామని తెలిపారు. అలాగే తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఆది పురుష్ సినిమాతో పాటు పలువురు ప్రముఖుల సినిమాలకు సైతం ముహూర్తాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ నేపథ్యంలో కరణ్ జోహార్ నటిస్తున్న రాఖి ఔర్ రాణి కి ప్రేమ్ కహాని షూటింగ్ సెట్ కి తనను పిలిపించుకొని కృతజ్ఞతలు తెలియ చేయడం ఆనందాన్ని కలిగించిందని ఆయన తెలిపారు.
Share this on your social network: