మాల మహానాడు నాయకుల ముందస్తు అరెస్ట్
Published: Tuesday November 23, 2021
జగిత్యాల, నవంబర్, 22 ( ప్రజాపాలన ప్రతినిధి): నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఇటీవల ఎస్సీ ఎస్టీ కేసులను లొట్టపీసు కేసులు అన్న వ్యాఖ్యలను ఖండిచి, ఒక పార్లమెంట్ సభ్యుని గా డా.బిఆర్ అంబేద్కర్ నిర్మించిన రాజ్యాంగం లో ఉండి చట్టాన్ని చులకన చేసి మాట్లాడిన వారిని ఎక్కడికక్కడే అడ్డుకుని ఘోరవ్ చేస్తామని తెలిపిన నేపథ్యంలో సోమవారం జిల్లా పర్యటనలో ఉన్న ఎంపీ అరవింద్ ను అడ్డుకుంటారని భావించి తెలంగాణ మాల మహానాడు జిల్లా అధ్యక్షులు చిత్తారి ప్రభాకర్, చింతకుంట్ల గంగాధర్ లను ముందస్తు అరెస్ట్ చేసి జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. వారిని పరామర్శించిన రాష్ట్ర ఉపాధ్యక్షులు మద్దెల నారాయణ, జిల్లా యువజన అధ్యక్షులు నర్ర రాజేందర్, ఉపాధ్యక్షులు తోట జగన్, మండల అధ్యక్షులు జక్కుల దేవయ్య, పోతుల లక్ష్మీ నర్సయ్య, ఎర్దండి గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: