వంగవీటి గ్రామ పంచాయతీరాజ్ కమిషనర్ జగత్ కుమార్ రెడ్డి పర్యటన
Published: Tuesday February 23, 2021
మధిర, ఫిబ్రవరి 22, ప్రజాపాలన: మండల పరిధిలోని వంగవీడు గ్రామాన్ని సందర్శించిన పంచాయతీరాజ్ జాయింట్ కమిషనర్ జగత్ కుమార్ రెడ్డి సందర్శనలో భాగంగా పాలవాగు ప్రాజెక్టు వద్దకు వెళ్లి ప్రాజెక్టు నిర్మాణ జరిగిన పనులను పరిశీలించారు. అనంతరం పల్లె పకృతి వనాన్ని సందర్శించి మొక్కలు నాటారు, అనంతరం నర్సరీని పరిశీలించి నర్సరీలో నాటిన మొక్కలు వివరాలను టెక్నికల్ సిబ్బంది అడిగి తెలుసుకున్నారు. పరిటాల గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పథకం పనులను పరిశీలించి ఉపాధి కూలీలతో మాట్లాడి కూలి సరైన టైమ్ కి వస్తుందా రావట్లేదు అడిగి తెలుసుకున్నారు
Share this on your social network: