చర్ల పటేల్ గూడెంలో వ్యాక్సిన్ టీకాలు వందకు వంద శాతం పూర్తి

Published: Wednesday October 27, 2021
ఇబ్రహీంపట్నం అక్టోబర్ తేదీ 26 ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం మండలం చర్ల పటేల్ గూడా గ్రామంలో కొవిడ్19-  వ్యాక్సినేషన్ టీకాలు వందకు వంద శాతం పూర్తయినట్లు మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు పి. కృపేష్ మంగళవారం  తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ ప్రపంచంలోనే ఈ కరోనా మహమ్మారితో అతలాకుతలమౌతున్న సందర్భంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నాయకత్వంలో స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారి సహకారంతో ఇబ్రహీంపట్నం మండలంలో కోవిడ్ టీకాలు 99 శాతం పూర్తి అయినట్టు తెలిపారు. మండలంలో  మొట్టమొదటగా చర్ల పటేల్ గూడెంలో సర్పంచ్ గీతా రామ్ రెడ్డి సహకారం మేరకు వందకు వంద శాతం వ్యాక్సిన్ పూర్తి చేసుకున్నందున డాక్టర్ అభిరామ్ ని వైద్య సిబ్బందిని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో మహేష్ బాబు, సర్పంచ్ గీతారాం రెడ్డి,  ఉప సర్పంచ్ నరేందర్, సెక్రటరీ జయమ్మ, వార్డు మెంబర్లు, గ్రామ పెద్దలు ప్రజలు పాల్గొన్నారు.