గ్రీన్ గిఫ్ట్ బ్రోచర్స్ ఆవిష్కరణ మంత్రి

Published: Wednesday February 17, 2021

బాలాపూర్ : ప్రజాపాలన: తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి  జన్మదిన ఉత్సవానికి గ్రీన్ గిఫ్ట్ ఇవ్వాలి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. కోటి వృక్ష అర్చన కార్యక్రమం లో భాగంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి పేదల సంక్షేమ పథకాల ప్రతినిధి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి కెసిఆర్  గారి జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఒక్కరు  మూడు మొక్కలు నాటండినీ కార్యకర్తలకు చెప్పారు. అదేవిధంగా గ్రీన్ గిఫ్ట్ బ్రోచర్లు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బడంగ్ పేట్  మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి, టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రామిడి రామ్ రెడ్డి, నియోజకవర్గ  మహిళా అధ్యక్షురాలు బండి మీనా నాగేష్, కార్పొరేషన్ కార్పొరేటర్లు, బొద్ర మో నీ రోహిణి రమేష్ ముదిరాజ్, శివ కుమార్, కార్పొరేషన్ కార్పొరేటర్లు, మాజీ వైస్ చైర్మన్ చిగురింత  నరసింహారెడ్డి, టిఆర్ఎస్ మహేశ్వరం నియోజకవర్గం బి సెల్ అధ్యక్షులు నిమ్మల నరేందర్ గౌడ్, కో ఆప్షన్ సభ్యులు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు, మహిళా నాయకులు, సోషల్ మీడియా ప్రతినిధులు, కుర్ముల్గూ మత్స్యకారుల అసోసియేషన్ అధ్యక్షులు శంకరయ్య, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు .