ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలి : జిల్లా బీజేవైఎం అధ్యక్షుడు విజయ రాజు

Published: Wednesday August 11, 2021
వికారాబాద్ బ్యూరో 10 ఆగస్ట్ ప్రజాపాలన : తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని బీజేవైఎం జిల్లా అధ్యక్షులు మదన్ పల్లి సర్పంచ్ విజయ్ రాజ్ డిమాండ్ చేశారు. బీజేవైఎం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో నిరుద్యోగుల సమస్య తీర్చాలని బూట్ పాలిష్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాలు లభించక యువత తమ కుటుంబాలను పోషించుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారని తెలియజేశారు. సీఎం కేసీఆర్ పథకాల అమలు పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని, లేనిపక్షంలో బీజేవైఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిజెవైఎం రాష్ట్ర శిక్షణా తరగతుల సభ్యుడు వివేకానంద రెడ్డి, బీజేవైఎం పట్టణ అధ్యక్షులు సాయి కృష్ణ ముదిరాజ్, ముఖ్య నాయకులు సాయి చరణ్ రెడ్డి, వివేకానంద రెడ్డి, బీజేవైఎం నాయకులు దినేష్ హరీష్, ఆదర్శ్, కార్తీక్, దయాకర్, శ్రీనివాస్, మల్లేశం, మధు, నవీన్ దితరులు పాల్గొన్నారు.