పలు కాలనీల్లో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన...మేయర్

Published: Thursday July 01, 2021
బాలపూర్ (ప్రతినిధి) ప్రజాపాలన : అభివృద్ధి పనులు చేపట్టిన త్వరగా పూర్తి కావాలని అధికారులకు సూచించిన కార్పొరేషన్ మేయర్. బడంగ్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్ లోని 31వ, 14 వ డివిజన్ లలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు స్థానిక ప్రజా ప్రతినిధులతో పాటు కలిసి కార్పొరేషన్ మేయర్ శంకుస్థాపన చేశారు. శ్రీ సాయి బాలాజీ హోమ్స్ - 2 కాలనిలో సీసీ రోడ్డు నిర్మాణ పనులను, అదేవిధంగా అండర్ డ్రైనేజీ పనులు ప్రారంభించి ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... చేపట్టిన పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అభివృద్ధి పనుల నాణ్యత ప్రమాణాల్లోను  ఉండేటట్లు చూడాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి, కార్పొరేటర్ జెనిగే భారతమ్మ కోమరయ్య, డీఈఈ అశోక్ రెడ్డి, టిఆర్ ఎస్ నాయకులు బొర్ర జగన్ రెడ్డి, జెనిగే శ్రీనివాస్, సాయి బాలాజీ కాలనీ కమిటీ సభ్యులు రాజు నాయక్, రాము గౌడ్, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.