ట్రాఫిక్ సిగ్నల్స్ కోసం స్థలాల పరిశీలన

Published: Saturday June 19, 2021
కోరుట్ల, జూన్ 18 ( ప్రజాపాలన ప్రతినిధి): కోరుట్ల పట్టణంలో ట్రాఫిక్‌ సిగ్నల్‌ కోసం మెట్ పల్లి డిఎస్పీ గౌస్‌ బాబా శుక్రవారం పట్టణంలోని కల్లూరు రోడ్డు చౌరస్తాలో స్థల పరిసీలన చేశారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ కోరుట్ల పట్టణంలో రోజురోజుకు ట్రాఫిక్‌ సమస్య పెరిగిపోతుందని, దానివల్ల వాహనదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. అలాగే రోడ్డు ప్రమాదాలు కూడా ఎక్కువగా జరుగుతున్నవని రోడ్డు ప్రమాదల నివారణ కోసమే ట్రాఫిక్‌ సిగ్నల్‌ ఏర్పాటు చేస్తున్నమని తెలిపారు. ఈ కార్యక్రమం లో కోరుట్ల ఎస్.ఐలు సతీష్, రాజాప్రమిలా పాల్గొన్నారు.