ఆ దాని అంబానీల సేవలో మునిగిన కేంద్ర ప్రభుత్వం

Published: Friday June 11, 2021

జన్నారం, జూన్ 10, ప్రజాపాలన ప్రతినిధి : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఆల్ ఇండియా సిఐటియు పిలుపుమేరకు గురువారం మండలం తో పాటు అన్ని గ్రామాలలో సిఐటియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని సిఐటియు మండల కార్యదర్శి కే బుచ్చన్న పేర్కొన్నారు. మండల కేంద్రంలో గల సీఐటీయూ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఆ దాని అంబానీల సేవలో మునిగి ప్రజానీకాన్ని పట్టించుకోవడం లేదన్నారు. కరోనాతో ఉపాధి కోల్పోతున్న సంఘటిత అసంఘటిత కార్మికుల జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంటే మోడీ ప్రభుత్వం ప్రజలను వారి ఆరోగ్యాన్ని గాలికొదిలేశారు అన్నారు కరోనా  వ్యాక్సిన్ను వేయించడంలో కేంద్ర ప్రభుత్వం ఆ వైఫల్యం చెందిందని మండిపడ్డారు. మండల కేంద్రాలలో ఐసోలేషన్ సెంటర్లను ఏర్పాటు చేయడంలో కూడా ప్రభుత్వం విఫలమైందన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు కే అశోక్ పెళ్లి అంజయ్య కే లింగన్న గుడ్ల రాజన్న బోడ కిషన్ తదితరులు పాల్గొన్నారు.