ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడమే నిజమైన సేవ : కార్పోరేటర్ గీతా ప్రవీణ్ ముదిరాజ్

Published: Saturday May 22, 2021
మేడిపల్లి, మే 21, (ప్రజాపాలన ప్రతినిధి) : ఉప్పల్, అర్బన్ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని కోవిడ్ బారిన పడిన పేద కుటుంబాలకు బియ్యం, నిత్యావసర సరుకులు  మారి సంస్థ (భారత గ్రామ నవ నిర్మాణ సంస్థ) ఆధ్వర్యంలో చిల్కానగర్ డివిజన్లోని బీరప్పగడ్డ మోడల్ మార్కెట్ ప్రాంతంలో ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుబాష్ రెడ్డి, స్థానిక కార్పోరేటర్ బన్నాల గీత ప్రవిణ్ ముదిరాజ్, మేడ్చల్ జిల్లా డిప్యూటీ డిఎం హెచ్ వో డాక్టర్ నారాయణ, ఉప్పల్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సౌందర్య లత, జిహెచ్ఎంసి డీసీ అరుణ కూమారి చేతులమీదుగా నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మారి సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్ మురళి, పిహెచ్సి కోఆర్డినేటర్ మాసాని ఎంకన్న, ప్రకాష్, ప్రవళిక, బిందు, శిరీష టీఆర్ఎస్ నాయకులు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్, సంతోష్, పల్లె నర్సింగ్ రావు, గడ్డం రవి కుమార్, కొండల్ రెడ్డి, గారికే సుధాకర్, శ్రీకాంత్, బాలు, అబ్బో బాయ్ తదితరులు పాల్గొన్నారు.