సామజిక దూరం తో సంత

Published: Wednesday May 05, 2021
పరిగి, 4 మే ప్రజాపాలన ప్రతినిధి : వికారాబాద్ జిల్లా దోమ మండల కేంద్రంలో ప్రతి మంగళవారం జరిగే సంతలో సామజిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటున్నట్లు సర్పంచ్ కె రాజిరెడ్డి తెలిపారు. మంగళవారం సంతలో కూరగాయల వ్యాపారులు తమ దుకాణాలను రెండు మీటర్ల దూరం మేరలో పెట్టుకునేలా ప్రతి వ్యాపారికి సున్నంతో బాక్స్ లు  వేయించారు. కొనుగోలు దారులు కూడా దూరంగా ఉండి కూరగాయలు కొనుగోలు చేసేలా వ్యాపారస్తులను దూరం పాటించాలని కోరారు. అందుకు ప్రతి వారం లా కాకుండా మరింత స్థలాన్ని సంతకు కేటాహిచినట్లు సర్పంచ్ తెలిపారు. సంత రోజు వాహనాలన్నీ బైపాస్ రోడ్డు లో వెళ్లేలా చూడాలని సిబ్బంది కి సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి చoద్రశేఖర్ పాల్గొన్నారు.