భాస్కర్ రావుకు నివాళులర్పించిన కూచిపూడి తల్లాడ, ఫిబ్రవరి 2 (ప్రజాపాలన న్యూస్):
Published: Friday February 03, 2023
ఖమ్మంజిల్లాలోని వి. వెంకటాపాలెం గ్రామానికి చెందిన పరుచూరి భాస్కరరావు దశదినకర్మ గురువారం ఆ గ్రామంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ తల్లాడ మండల అధ్యక్షులు కూచిపూడి వెంకటేశ్వరరావు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సంతాప సానుభూతిని వ్యక్తం చేశారు. నివాళులు అర్పించిన వారిలో నాయకులు సరికొండ శ్రీనివాస్ రాజు, సరికొండ అప్పలరాజు, కొమ్మినేని నర్సింహారావు, కొమ్మినేని రాము, తదితరులు ఉన్నారు.
Share this on your social network: