*జడ్పీటీసీ దిరిశాల ప్రమీలను సన్మానించిన కళాకారులు..

Published: Friday February 03, 2023
తల్లాడ, ఫిబ్రవరి 2 (ప్రజాపాలన న్యూస్): తల్లాడ మండలంలోని కుర్న వల్లి గ్రామంలో నవభారత నాట్య మండలి 47వ వార్షికోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా చదువు -  సేద్యం అనే నాటికను వీక్షకులకు అర్థమయ్యే రీతిలో ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తల్లాడ జడ్పీటీసీ  దిరిశాల ప్రమీలకు జ్ఞాపికను అందించి శాలువాలు పూలమాలలతో సత్కరించారు.  ప్రముఖ రాష్ట్ర కళాకారులు పుతుంబాక శ్రీకృష్ణ ప్రసాద్, తోటకొండల నరసింహారావు,  పాతాళపతి రోశయ్య చౌదరి హాజరయ్యారు. కుర్నవల్లి నవభారత నాట్య మండల అధ్యక్షులు జనార్దన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి శీలం వెంకట్ నారాయణరెడ్డి ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. తొలుత స్థానిక ప్రభుత్వ విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అయిలూరి లక్ష్మి, కుర్నవల్లి సహకార సొసైటీ చైర్మన్ అయిలూరి ప్రదీప్ రెడ్డి, ఎంపీటీసీ అన్నెం కళావతి, గ్రామ కళాకారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.*