తాటి చెట్టు పైనుండి కిందపడి వ్యక్తికి తీవ్ర గాయాలు
Published: Tuesday December 20, 2022
హుజురాబాద్ డిసెంబర్ 19 ప్రజాపాలన రిపోర్టర్ శంకరపట్నం:
హుజురాబాద్ మండలం చెల్పూర్ గ్రామానికి చెందిన పంజాల లక్ష్మయ్య గౌడ్ (59). సోమవారము వృత్తిరీత్యా తాడిచెట్టు కల్లు తీయడానికి తాడిచెట్టు ఎక్కగా ప్రమాదవశాత్తు జారిపడగా తాడిచెట్టు పైనుండి కిందపడి తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక తొటి గీతకార్మికులు 108 ఫోన్ ద్వారా సమాచారము అందించగా హుటాహుటిన 108సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని లక్ష్మయ్యకు ప్రధమ చికిత్స అందిస్తు హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Share this on your social network: