సోనియా గాంధీ జన్మదిన సందర్భంగా రక్తదానం చేసిన ఎంపీఆర్ మేడిపల్లి, డిసెంబర్ 9 (ప్రజాపాలన ప్రతి

Published: Saturday December 10, 2022
కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, తెలంగాణ రాష్ట్ర ప్రదాత సోనియా గాంధీ జన్మదిన వేడుకలను బోయినపల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.అనంతరం సోనియా గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని  
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరియు జిల్లా అధ్యక్షులు నందికంటి శ్రీధర్ సమక్షంలో జరిగిన రక్తదాన శిబిరంలో ఉప్పల్ నియోజకవర్గం ఏ -బ్లాక్ అధ్యక్షుడు మందుముల పరమేశ్వర్ రెడ్డి సైతం రక్తదానం చేశారు.పరమేశ్వర్ రెడ్డితో పాటు ఏ బ్లాక్ నుంచి వచ్చిన కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో రక్తదానం చేశారు.ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రతినిధులు మేకల శివ రెడ్డి గారు ,పసుల ప్రభాకర్ రెడ్డి, కంది అగిరెడ్డి, మర్రి రంజిత్ రెడ్డి, బోరంపేట కృష్ణ, చెన్ రెడ్డి రఘపతి రెడ్డి,డివిజన్ అధ్యక్షులు రఫీ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రవణ్ రెడ్డి ,ఉప్పల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అరుణ్ , దేవి రెడ్డి, సల్ల ప్రభాకర్ రెడ్డి, లింగంపల్లి రామకృష్ణ, మహేష్ యాదవ్ ,సునీల్ రెడ్డి,డిల్లీ చంద్రశేఖర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి నవీన్ యాదవ్, అలీం, బొక్క సురేష్,జిత్తు, సుధాకర్, పాలడుగు లక్ష్మణ్,సతీష్, నరేష్, రాకేష్,శివకాంత్, శ్రీకాంత్, ఆశవన్ సింగ్, భాను,బాపి రెడ్డి తదితరులు పాల్గొన్నారు