అయ్యప్ప స్వామి ఆలయంలో ఉదయాస్తమాన పూజలు

Published: Friday December 09, 2022

మధిర రూరల్ డిసెంబర్ 8 (ప్రజాపాలన ప్రతినిధి) మధిర పట్టణంలోని అయ్యప్ప నగర్ లో వేంచేసి ఉన్న శ్రీ స్వామి అయ్యప్ప దేవాలయంలో గురువారం నాడు  జరిగిన ఉదయాస్తమాన పూజల్లో సొసైటీ అధ్యక్షులు వార్డు కౌన్సిలర్ బిక్కి కృష్ణ ప్రసాద్ అనిత దంపతులు పాల్గొన్నారు. స్వామివారి 15వ మండల పూజల్లో భాగంగా ఆలయంలో ఈ ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. అనంతరం అయ్యప్ప స్వామి భక్తులకు, మాలధారులకు వారు సొసైటీ అధ్యక్షులు వార్డు కౌన్సిలర్  కృష్ణ ప్రసాద్ అనిత దంపతులు అన్నదానం వితరణ  చేశారు. ఈ సందర్భంగా సొసైటీ అధ్యక్షులు వార్డ్ కౌన్సిలర్ కృష్ణ ప్రసాద్ అనిత మాట్లాడుతూ అన్ని దానాల కంటే అన్నదానం మిన్న అని, అన్నం పరబ్రహ్మ స్వరూపం అని ఆయన అన్నారు. పేదవాడి ఆకలి తీర్చేందుకు ప్రతి ఒక్కరూ అన్నదానాలు చేయాలన్నారు. ప్రతి సంవత్సరం అయ్యప్ప స్వామి ఆలయంలో అయ్యప్ప మాలదారులకు అన్నదానం ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు ఈ అన్నదాన కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు వార్డు కౌన్సిలర్ బిక్కీ కృష్ణ ప్రసాద్ అనిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు గురువారం నాడు సాయంత్రం పూట అయ్యప్ప స్వామి దేవాలయంలో కార్యక్రమం పాల్గొని శివేలు కార్యక్రమంలో పాల్గొనిస్వాములకు మాలదారులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమంలో గురుస్వామి బత్తుల శ్రీనివాసరావు  స్వామి మైనీడి జగన్మోహన్ రావు స్వామి పసుపులేటి నాగేంద్ర శ్రీనివాసరావు దేవి శెట్టి రంగా, గాంధీ స్వాములు అర్చకులు తదితరులు పాల్గొన్నారు.