ఘనంగా వెలుగుగుట్ట దేవాలయంలో చండీ హోమం
Published: Tuesday October 12, 2021
మేడిపల్లి, అక్టోబర్11 (ప్రజాపాలన ప్రతినిధి) : శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వెలుగుగుట్ట శ్రీ మల్లిఖార్జున స్వామి దేవాలయంలో 5వ రోజు శ్రీదుర్గా పరమేశ్వరి అమ్మవారు కాశీ అన్నపూర్ణేశ్వరీగా సమస్తలోకాలకు అన్నపానీయాలు లోటులేకుండా అనుగ్రహించే అన్నపూర్ణ అవతారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. సోమవారం ఉదయం పంచామృత అభిషేకములు, దుర్గా సూక్తం, శ్రీ సూక్తం, విధానంతో అభిషేకము, అలాగే అలంకారము, సుహాసినులచే కుంకుమార్చన విశేషంగా నక్షత్ర హారతులు మంత్రపుష్పము తీర్థ ప్రసాద వితరణ జరిగింది. తదనంతరం చండీ హోమం నిర్వహించారు. మహా మంగళ హారతి తీర్థప్రసాద వితరణ అత్యంత భక్తి ప్రపత్తులతో విశేషమైన భక్తజనులతో వైభవంగా జరిగినది. అన్నప్రసాద వితరణ దాతలుచే నిర్వహించబడినది.
Share this on your social network: