Home తాజా వార్తలు 18న కోర్టుకు రండి …కేటీఆర్ ను ఆదేశించిన కోర్టు – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana

18న కోర్టుకు రండి …కేటీఆర్ ను ఆదేశించిన కోర్టు – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana

by Prajapalana
0 comments
18న కోర్టుకు రండి ...కేటీఆర్ ను ఆదేశించిన కోర్టు - Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



ముద్ర, తెలంగాణ బ్యూరో :- మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వేసిన కేసులో ట్విస్ట్‌లో చోటు చేసుకుంది. ఈ నెల 18న కోర్టుకు హాజరై వాంగ్మూలం సమర్పించాలని కేటీఆర్ ను న్యాయస్థానం ఆదేశించింది. సోమవారం ఈ వ్యవహారంపై నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. న్యాయస్థానం నిరూపణ వివరణ కేటీఆర్‌ను సూచించింది. ఈ నెల 18న కేటీఆర్ కోర్టుకు హాజరై వివరణ ఇవ్వనున్నారు. కేసుకు సంబంధించి వాంగ్మూలం ఇవ్వనున్నారు. ఆయనతో పాటు సాక్షులు కూడా వాంగ్మూలం నమోదు చేయనున్నారు. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ దాసోజు శ్రావణ్ కుమార్, బాల్క సుమన్ కేటీఆర్‌కు సాక్షులుగా ఉన్నారు.

అక్కినేని నాగచైతన్య, సమంత విడిపోవడానికి కేటీఆర్ కారణమని మంత్రి కొండా సురేఖ ఇటీవల మీడియాతో జరిగింది. ''ఎన్‌ కన్వెన్షన్‌ని కూల్చకుండా ఉండాలంటే సమంతను తన దగ్గరికి పంపించాలని కేటీఆర్‌ డిమాండ్ చేశారు. ఇందుకు సమంత ఒప్పుకో నాగార్జున ఇంటి నుంచి గెంటేశారు… అని కొండా సురేఖ అన్నారు. కొండా సురేఖ చేసిన ఈ వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపాయి. దీనితో కేటీఆర్ కోర్టును ఆశ్రయించారు. తనపై ఆమె చేసిన వ్యాఖ్యలు తన ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్నాయని వెంటనే క్రిమినల్ చర్యలు పిటిషన్‌లో పేర్కొన్నారు. అలాగే ఇదే కేసులో హీరో నాగార్జున కూడా కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన కూడా కోర్టుకు వ్యక్తిగతంగా హాజరైన విషయం తెలిసిందే

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Page Perfect Tech