పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి మేయర్ జక్క వెంకట్ రెడ్డి

Published: Monday May 16, 2022
మేడిపల్లి, మే 15 (ప్రజాపాలన ప్రతినిధి)  
పేద ప్రజలకు తక్కువ ఖర్చులతో మెరుగైన వైద్య సేవలను ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు అందించాలని పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ జక్క వెంకట్ రెడ్డి సూచించారు. ఉప్పల్ బస్ డిపో ఎదురుగా  నూతనంగా ఏర్పాటు చేసిన  ఏబి న్యూ లైఫ్ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మేయర్ జక్క వెంకట్ రెడ్డి పాల్గొని స్థానిక కార్పొరేటర్ పిట్టల మల్లేష్ లతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హాస్పటల్ చైర్మన్ డాక్టర్ బాలకృష్ణ, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కే అనిల్ కుమార్, బోడుప్పల్ డిప్యూటీ మేయర్ 
కొత్త లక్ష్మీ రవి గౌడ్, కార్పొరేటర్లు అనంత రెడ్డి, మధుసూదన్ రెడ్డి, నాయకులు బండి సతీష్ గౌడ్, బొడిగే కృష్ణ గౌడ్,
డాక్టర్ విక్టర్ ఇమాన్యుల్, 
హాస్పిటల్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ అంజన్ కుమార్, శరత్ గౌడ్, మత్స్యగిరి గౌడ్ , శ్రీనివాస్ గౌడ్, గిరీష్ రెడ్డి, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.