అంబేడ్కర్ మాల యువజన సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

Published: Tuesday March 22, 2022

కోరుట్ల, మార్చి 21 (ప్రజాపాలన ప్రతినిధి): కోరుట్ల పట్టణంలోని అంబేడ్కర్ యువజన సంఘం మాల ఆధ్వర్యంలో ఆదివారం రోజున ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో అంబెడ్కర్ యువజన సంఘం అధ్యక్షులుగా పసుల కృష్ణ ప్రసాద్, ఉపాధ్యక్షులుగా మ్యకల మహేష్,ప్రధాన కార్యదర్శిగా పొట్ట సురేందర్, కోశాధికారిగా దామ రాజేష్, సహాయ కార్యదర్శి గా కంబ ప్రశాంత్ లు గెలిపొందినట్లు ఎన్నికల నిర్వహణ కమిటీ తెలిపారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అభ్యర్థులు సంఘ అభివృద్ధికి కోసం అహర్నిశలు కృషి చేస్తామని తెలిపారు.