తిరుమల దర్శన ఫలం
కలియుగ దేవుని సన్నిదానం కడు రమణీయం : ముందు వరాహస్వామి దర్శనం ఆతరువాతే వెంకటేశ్వరుని దర్శనం.
కలియుగ తిరువేంకటనగరి నాధునిగా కలియుగంలో భక్తులకు కొంగుబంగారమైన దివ్యారామం తిరుమలలో నిత్యం కల్యాణంగా గోవిందుడు భక్తులకు దర్శనమిస్తున్నాడు. సప్తాచల నిలయంలోని ఏడో కొండైన వెంకటాచలంలో దివ్యారామంవుంది. పురాణాలు, శాస్త్రాలు, స్థలమహత్యాలు, ఆళ్వార్ల ప్రబంధాల్లో తిరుమల గురించి సవివరంగా వివరించారు. తిరునగరి దర్శన భాగ్యం గురించి రుగ్వేదంలోను అష్టాదశపురాణాల్లోను ప్రస్తావనవుంది. శ్రీనివాసుడు తిరుమలను తన ఆవాసంగా మలచుకుని భక్తజనవరదుడిగా మారి ఐదువేల సంవత్సరాలయింది. అప్పటివరకూ తిరుమల శిఖరం వరాహస్వామి సొంతం. శిఖరంపై వంద చదరపు అడుగుల స్థలాన్ని శ్రీవేంకటేశుడు వరాహస్వామి దగ్గర బహుమతిగా తీసుకున్నాడు. అందుకు ప్రతిగా తనకోసం వచ్చే భక్తులు ముందుగా వరాహస్వామిని దర్శించుకువచ్చేలా చూస్తానని ఓ హామీ ఇచ్చాడు. ఆ మేరకు వరాహస్వామికి ఓ ఒప్పందపత్రం సైతం రాసిచ్చాడు శ్రీనివాసుడు. ఈ ఒప్పందం రాసిన తామ్రపత్రం శ్రీనివాసుని మూలవిరాట్టు దగ్గర ఇప్పటికీ ఉందట. బ్రాహ్మీలిపిని పోలిన అక్షరాలు దానిమీద ఉన్నాయి. తిరుమల వెళ్లే భక్తులు ముందుగా వరాహస్వామిని దర్శించుకుంటే శ్రీనివాసుడు సంతోషిస్తాడని పెద్దలు చెప్పేది అందుకేనన్నమాట.
Share this on your social network:
Related News
కొవ్వూరు న్యూస్: గోదావరి పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చేది గౌతమమహర్షి పేరు. గలగలా పారే గోదా...
భారతీయుల ప్రాచీన ,పురాణ గ్రంధాలలో మహాభారతం ఒకటి ,తింటే గారలే తినాలి వింటే భారతమే వినాలి ...
రాజమహేంద్రవరం, జూలై 1 : బుద్ధవరపు చారిటబుల్ ట్రస్ట్, దేవాదాయ, ధర్మ...
వలిగొండ ప్రజాపాలన మండలంలోని వెంకటాపురం గ్రామ పర...
జన్నారం మార్చి 4 ప్రజా పాలన:
బాలాపూర్: (ప్రతినిధి) ప్రజాపాలన న్యూస్; మహా శివర...
వెల్గటూర్, మార్చి 24 (ప్రజాపాలన ప్రతినిధి) : వెల్గట...
వెల్గటూర్, మార్చి 28, (ప్రజాపాలన ప్రతినిధి) : వెల్గటూర్ మ...
వలిగొండ, మార్చి 29, ప్రజాపాలన ప్రతినిధి : మండల పరి...
మధిర, ఏప్రిల్ 21, ప్రజాపాలన ప్రతినిధి : మధిర రామాలయం శ్రీరామనవమిని పురస్కరిం...
బాలపూర్, ఏప్రిల్ 21,
గుమ్మడిదల, ఏప్రిల్ 25, ప్రజాపాలన ప్రతినిధి : వికారాబాద్ బ్యూరో 06 సెప్టెంబర్ ప్రజాపాలన : శ్రావణ మాసం చివరి ...
యాదాద్రి భువనగిరి జిల్లా, సెప్టెంబర్ 15, ప్రజాపాలన ప్రతినిధి : మండల పరిధిలోన...