రాబోయే ఒలింపిక్స్ క్రీడల్లో స్వర్ణాన్ని సాదించాలి -తెలంగాణ CM KCR

Published: Friday May 19, 2023
ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ నికాత్ జరీనా రాబోయే ఒలింపిక్స్ క్రీడల్లో స్వర్ణాన్ని సాధించి తెలంగాణ సహా భారత దేశ ఘనకీర్తిని మరోసారి విశ్వానికి చాటాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఆకాంక్షించారు. ఇప్పటికే పలు ప్రపంచ వేదికల మీద విజయాలను సొంతం చేసుకుంటూ దేశ ప్రతిష్టను ఇనుమడింపచేసిన నిఖత్ జరీన్ కు రాబోయే ఒలింపిక్స్ పోటీల్లో పాల్గొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందచేస్తుందని సీఎం స్పష్టం చేశారు. సచివాలయంలో నిఖత్ జరీన్ సీఎంతో ఈరోజు మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొనేందుకు తీసుకునే శిక్షణ, కోచింగ్, రవాణా తదితర ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని సీఎం స్పష్టం చేశారు. అందుకు సంబంధించిన ఖర్చుల కోసం రూ. 2 కోట్లను సీఎం ప్రకటించారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతి కుమారి చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఈ సందర్భంగా క్రీడాశాఖ మంత్రి శ్రీ శ్రీనివాస్ గౌడ్  తో పాటు మంత్రులు శ్రీ మహ్మద్ అలీ , శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి , శ్రీ మల్లారెడ్డి , ఎమ్మెల్సీ శ్రీ మధుసూదనాచారి, ఎమ్మెల్యేలు శ్రీ బాలరాజు , శ్రీ బల్క సుమన్ , శ్రీ విఠల్ రెడ్డి, సీఎంఓ కార్యదర్శి శ్రీ భూపాల్ రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ డా. ఈడిగ ఆంజనేయ గౌడ్, క్రీడాశాఖ కార్యదర్శి శ్రీ సందీప్ సుల్తానియా తదితరులు పాల్గొన్నారు.