ప్రజాపాలన దినపత్రిక క్యాలెండర్ ను ఆవిష్కరించిన మేయర్ జక్క వెంకట్ రెడ్డి

Published: Wednesday January 11, 2023
మేడిపల్లి, జనవరి 10 (ప్రజాపాలన ప్రతినిధి)
ప్రజాపాలన తెలుగు జాతీయ దినపత్రిక క్యాలెండర్ ను పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ జక్క వెంకట్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ ప్రజల మనస్సును చురగొన్న ప్రజాపాలన దినపత్రిక దిన, దినాభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు. జర్నలిస్టులు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరించడం కోసం కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కో ఆప్షన్ సభ్యులు రాందాస్ గౌడ్, పీర్జాదిగూడ  కార్పొరేషన్ బీఆర్ఎస్ మహిళా అధ్యక్షురాలు నిర్మల,బీఆర్ఎస్ నాయకులు మనోరంజన్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి (ప్రభు) తదితరులు పాల్గొన్నారు.