ఆలయ అభివృద్ధికి రూ1లక్ష 35 వేలు ఆర్థిక సహాయం అందజేసిన బీఆర్ఎస్ నాయకులు బండారి లక్ష్మారెడ్డి మ

Published: Tuesday January 10, 2023
హబ్సిగూడ నుండి ఉప్పల్ కు వెళ్లే ప్రధాన రహదారిలో నెలకొన్న 
శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ ప్రహరీ గోడ నిర్మాణం కోసం బీఎల్అర్ ట్రస్ట్ చైర్మన్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బండారి లక్ష్మారెడ్డి రూ 1లక్ష 35 వేలు ఆర్థిక సహాయాన్ని ఈవో భాగ్యలక్ష్మి,మేనేజర్ శ్రీనివాస్ శర్మ ( పంతులు) కు అందజేశారు. 
ఈ సందర్భంగా బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ బిఎల్అర్ ట్రస్ట్ ద్వారా అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.
అభయాంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు బాన్నల ప్రవీణ్, నేమురి మహేష్ గౌడ్, శ్రీకాంత్ రెడ్డి
కొకొండ జగన్ తదితరులు పాల్గొన్నారు.