గ్రామీణ యువత క్రీడలలో రాణించాలి : ఎంపీపీ అరిగెల మల్లికార్జున్
ఆసిఫాబాద్ జిల్లా మార్చి15 (ప్రజాపాలన, ప్రతినిధి) : గ్రామీణ యువత క్రీడలలో రాణించాలని ఎంపీపీ అరిగెల మల్లికార్జున్ అన్నారు. గురువారం మండలంలోని రౌట సంకేపల్లి, పర్శ నంబాల, గ్రామాలలో పర్యటించి, పర్శ నంబాల లో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ గ్రామీణ యువత చదువులతో పాటు క్రీడలలో కూడా రాణించి, మండలానికి మంచి పేరు తేవాలన్నారు. క్రీడలతో మానసిక ఉల్లాసం కలుగుతుందని, యువతలో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసుకు రావాలన్నారు. అలాగే పర్శనంబాల నుండి రౌట గ్రామం వరకు చేస్తున్న గ్రావెల్ రోడ్డు ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సింగిల్విండో చైర్మన్ అలీ బిన్ అహ్మద్, నాయకులు కృష్ణయ్య, గ్రామ ప్రజలు ఉన్నారు.
Share this on your social network:
Related News
మధిరఈరోజు*ఫ్రెండ్స్ యూత్ మధిర వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన క్రికెట్ టోర్నమెంట్ లో ప్ర...
ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో మధిర నియోజకవర్గ స్థాయి క్రికెట్ ...
*యువత క్రీడారంగంలో ముందుకు సాగాలి: రాణి రుద్రమదేవి*
...
జన్నారం ఫిబ్రవరి 4 ప్రజా పాలన. గ్రామ సర్పంచ్ బంటు ఆంజనేయులు ముదిరాజ్ మధిర, మార్చి 1, ప్రజాపాలన ప్రతినిధి: ఖమ్మం లొ జరి...
సిద్దులూరు ఎంపిటిసి గౌసొద్దిన్ జిఆర్ఆర్ యువజన సంఘం అధ్యక్షుడు కోకట్ రాఘవేంద...
జన్నారం మార్చి 15 ప్రజాపాలన :