మేడిపల్లి, సెప్టెంబర్30 (ప్రజాపాలన ప్రతినిధి) పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ 5వ డివిజన్లో

Published: Saturday October 01, 2022
మేడిపల్లి, సెప్టెంబర్30 (ప్రజాపాలన ప్రతినిధి)

పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ 

 5వ డివిజన్లో ఇటీవల కురుస్తున్న వర్షాలతో లోతటి ప్రాంతాలు జలమయమయ్యాయి. నీట మునిగిన కాలనీలలో స్థానిక కార్పొరేటర్ బొడిగే స్వాతి కృష్ణ గౌడ్, డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ గౌడ్ లతో కలిసి కార్మిక శాఖ మంత్రివర్యులు చామకూర మల్లారెడ్డి పర్యటించారు. అనంతరం మంత్రి ఎస్ఎన్డిపి  పనులను  అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కొల్తురి మహేష్, బచ్చ రాజు, సీనియర్ తెరాస నాయకులు పప్పుల అంజిరెడ్డి, అల్లువాల దేవేందర్ గౌడ్ ,కాలనీ వాసుల, పెద్దలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.