నాగ పల్లి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

Published: Thursday March 25, 2021

వెల్గటూర్, మార్చి 24 (ప్రజాపాలన ప్రతినిధి) : వెల్గటూర్ మండలం కిషన్ రావు పేట గ్రామ శ్రీ నాగ పెళ్లి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో ప్రారంభించారు. బుధవారం రోజు ప్రొబోదిగా, విశ్వక్సేన వీధి, ఛతు: స్థానార్చన: గిరి ప్రదక్షిణ, అపరిష్టయనహొమవిది, బలిహరణం, అప్రతిరద, యోగ చైతన్య హోమం, తీర్థ ప్రసాద వితరణ ఆశీర్వచనం ఉబయ వేదాంత సూర్య పంచాంగ కర్త శ్రీ జగన్నాథం విష్ణువర్ధనా ఆచార్యుల దివ్య కరములతో శాస్త్రోక్తంగా నిర్వహించారు. సింహాచలం మురళీధర స్వామి, స్థానాచార్యులు తిరునాహరి శ్రీనివాసాచార్య, ఆలయ అర్చకులు జగన్నాథం శ్రీనివాసాచార్య, ఆలయ చైర్మన్ పూదరి రమేష్, కార్యదర్శి అల్గునూరి సతీష్, సర్పంచ్ మెరుగు కొమురయ్య, ఎం.పీ.టీ.సీ సప్న జ్యోతి రాజు, ధర్మ కర్తలు దాసరి రామచంద్రరావు, అన్నమనేని గజేంద్ర రావు, గౌరీ లక్ష్మీనారాయణ, మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు కుమ్మరి వెంకటేష్, ఆలయ కమిటీ సభ్యులు నక్క హనుమాడ్లు, పులి ఎల్లయ్య దావన పెళ్లి రమేష్ భోగి సాగర్, బావనపెళ్లి హరీష్, పులి ప్రశాంత్, అలుగునూరి మల్లేశం, శ్రియఃజగన్నాధ వేదపాఠశాల వేదే విద్యార్థులచే పూజా కార్యక్రమాలు నిర్వహించారు.