hacklink al hack forum organik hit kayseri escort istanbul escortbakırköy escortataköy escortkadıköy escortşişli escorteskortistanbul escort bayanataşehir escortextrabetzlibrarytravesti escortgrandpashabetgamdomCasinomaxihipbetgrandbettingholiganbetholiganbet girişSoft2betizmir escortSolana Trading Botgrandpashabettosple.comGrandpashabetGrandpashabetjojobetholiganbet girişbetzuladeneme bonusu veren sitelerbetkomzbahiszbahisbetsatsonbahisperabetsekabet466 marsbahispadişahbetpadişahbet girişpadişahbetalobet girişmatadorbetSweet Bonanzasahabettez yazdırmaextrabet girişgiftcardmall/mygiftimajbetbetcio girişdiyarbakır escortmeritbetポルノを見るimajbet
Home తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌కు కోర్టు నోటీసులు – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana News

మాజీ సీఎం కేసీఆర్‌కు కోర్టు నోటీసులు – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana News

by Prajapalana
0 comments
మాజీ సీఎం కేసీఆర్‌కు కోర్టు నోటీసులు - తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



  • భూపాలపల్లి ప్రిన్సిపాల్ సెషన్స్ జడ్జి తరపున నోటీసు
  • మేడిగడ్డ కుంగుబాటు పిటిషన్‌పై నిర్ణయం
  • సెప్టెంబర్ 5న కోర్టుకు హాజరుకావాలన్న కోర్టు
  • మాజీ మంత్రి హరీశ్వరావు, ఇరిగేషన్ సెక్రెటరీ రజత్ కుమార్..
  • సీఎంఓ కార్యదర్శి స్మిత, మేఘా కృష్ణారెడ్డి, ఎల్‌ఏండ్‌టీకి తాఖీదులు
  • రాజలింగమూర్తి రివిజన్ పిటిషన్‌పై విచారణ

ముద్ర, తెలంగాణ బ్యూరో :మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు భారీ షాక్ తగిలింది. ఇప్పటికే విద్యుత్ విచారణ కమిషన్ నుంచి నోటీసులు అందాయి.. తృటిలో తప్పించుకున్న కేసీఆర్ కు.. ఇప్పుడు ప్రతిష్టాత్మక ప్రాజెక్టు నిర్మాణం, కుంగుబాటుపై భూపాలపల్లి సెషన్స్ కోర్టు నుంచి నోటీసులు జారీ అయ్యాయి. ఓవైపు ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేసీఆర్ కుమార్తె కవితకు బెయిల్ రాక.. బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడుతూ ఆగమాగంగా పరిస్థితులు మారిన నేపథ్యంలో .. కేసీఆర్‌కు షాక్ ఇచ్చినట్లుగా నోటీసులు ఇచ్చారు.

కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు వివాదం బీఆర్‌ఎస్‌ను వదలడం లేదు. ఈ వ్యవహారంలో గులాబీఅధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు మరోసారి షాక్ ఇచ్చింది. మేడిగడ్డ బ్యారేజీ డ్యామేజ్ వ్యవహారంలో భూపాలపల్లి ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి కోర్టు కేసీఆర్, హరీశ్ రావు సహా మొత్తం 8 మందికి నోటీసులు జారీ చేసింది. నాగవెల్లి రాజలింగమూర్తి అనే వ్యక్తి దాఖలు చేసిన రివిజన్ పిటిషన్‌ను స్వీకరించిన కోర్టు.. సెప్టెంబరు 5న విచారణ జరిపింది. ఆ రోజున విచారణకు రావాల్సిందిగా నోటీసులో కోర్టు పేర్కుతోంది. గతంలో భూపాలపల్లి ఫస్ట్ క్లాస్ ప్రిన్సిపల్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో విచారణ నేపథ్యంలో రివిజన్ పిటిషన్ దాఖలు చేయడంతో ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి విచారణ చేపట్టారు. మేడిగడ్డ కుంగుబాటుపై అక్టోబరు 25న స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశానని, ఆ తర్వాత జిల్లా ఎస్పీకి, డీజీపీకి కూడా ఫిర్యాదు చేశానని, ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంతోపాటు ఎలాంటి చర్యలు తీసుకోనందున కోర్టును ఆశ్రయించానని నాగవెల్లిమూర్తి రివిజన్ పిటిషన్‌లో పేర్కొన్నారు.

హైకోర్టు సూచనతో..

మొదట తాను పిటిషన్ ను ఫస్ట్ క్లాస్ ప్రిన్సిపల్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కొట్టివేసింది, దానికి కారణాలను కూడా తెలపలేదని, విధిలేని పరిస్థితుల్లో హైకోర్టును ఆశ్రయించానని, ఆ తర్వాత రివిజిన్ పిటిషన్‌ను జిల్లా కోర్టులో దాఖలు చేసినట్లుగా సూచించినట్లు రాజలింగమూర్తి తెలిపారు. బ్యారేజీలోని ఏడవ బ్లాకులో పిల్లర్ భూమిలోకి కుంగిపోవడం, పెద్ద శబ్దంతో ఒక పిల్లర్‌కు పగుళ్లు రావడంతో అసిస్టెంట్ ఇంజినీర్ స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు, తీవ్రవాద శక్తుల ప్రమేయం ఉన్నదనే అనుమానాన్ని పోలీసులు వ్యక్తం చేశారు, పోలీసులు కూడా ఐపీసీలోని సెక్షన్ 427 ప్రకారం ఎఫ్‌ఈఆర్ (నెం. 174/2023) న మోదు, మరు రోజే చేశారు. క్లోజ్ చేశారు పిటిషనర్ గుర్తుచేశారు.

బాధ్యులు వారే

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీకి డిజైన్ హోదా నిర్మాణంలో నాణ్యతలోపం, నిర్వహణలో నిర్లక్ష్యం వరకు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, ఇరిగేషన్ మంత్రిగా హరీష్ రావు సహా ఒక్కొక్కరు బాధ్యులుగా ఉన్నారని రివిజన్ పిటిషన్‌లో రాజలింగమూర్తి ఉన్నారు. కేసీఆర్, హరీశ్ రావుతో పాటు అప్పటి ఇరిగేషన్ సెక్రటరీ రజత్ కుమార్, సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్, ఇంజినీర్ ఇన్ ఛీఫ్ హరిరామ్, చీఫ్ ఇంజినీర్ శ్రీధర్ ప్రాజెక్టు, కాంట్రాక్టును దర్శించుకున్న 'మేఘా' నిర్మాణ సంస్థ అధినేత కృష్ణారెడ్డి, బ్యారేజీని నిర్మించిన ఎల్ అండ్ టీ ప్రతినిథులను పిటిషనర్లుగా నిర్వహిస్తున్నారు. వారికి భూపాలపల్లి ప్రిన్సివల్ సెషన్స్ జడ్జి నోటీసులు జారీ చేశారు.

విచారణకు హాజరవుతారా?

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ డిజైన్, నిర్మాణం, నిర్వహణలో నిర్లక్ష్యం వంటి అంశాల్లో అప్పటి సీఎం కేసీఆర్, ఇరిగేషన్ మంత్రి హరీశ్‌రావు సహా పలువురు బాధ్యులుగా ఉన్నారని రివిజన్ పిటిషన్‌లో పేర్కొన్నారు. సెప్టెంబరు 5న జరిగే విచారణకు వీరంతా హాజరువుతారా? లేదా అన్నది ఆసక్తిగా మారింది. ఇప్పటికే విద్యుత్ విచారణ కమీషన్ నోటీసుల నేపథ్యంలో కేసీఆర్ సుప్రీం కోర్టు మెట్లు ఎక్కారు. అయితే, ఈసారి మాత్రం ఏకంగా కోర్టు నుంచే నోటీసులు రావడంతో.. వారంతా కోర్టు నోటీసులను అనుసరించి సెప్టెంబరు 5న విచారణకు హాజరవుతున్నారా? లేక వారి తరపున న్యాయవాదులను పంపిస్తారా? అన్నది ఉత్కంఠగా మారింది.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Page Perfect Tech

Partners:
georgia escort | escort georgia | tbilisi escort | batumi escort | georgia escort blog | escort georgia ads | georgia escort listings