hacklink al hack forum organik hit kayseri escort istanbul escortbakırköy escortataköy escortkadıköy escortşişli escorteskortistanbul escort bayanataşehir escortholiganbetzlibrarytravesti escortgrandpashabetgamdomCasinomaxihipbethacklinkholiganbetholiganbet girişjojobet girişSoft2betcasibomsahabetSekabetTümbetyemek kartı bozdurmabuca escortAdana escortAdana escortdinamobetzbahisopenbook market id createjojobetsekabetcasibomPortobetMegabahiselon musk порноjojobet465marsbahisPerabet güncel girişporno türk ifşa vip porno izle otobetbetkomfilm izlemarsbahisjojobetkralbet güncel girişvanilla gift cardcasibom güncel girişbetcio
Home తాజా వార్తలు కోర్టు జోక్యం తగదు – గ్రూప్ -1 పిటిషన్లపై తీర్పు రిజర్వు – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana

కోర్టు జోక్యం తగదు – గ్రూప్ -1 పిటిషన్లపై తీర్పు రిజర్వు – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana

by Prajapalana
0 comments
హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు...! - తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



  • అభ్యంతరాల స్వీకరణ తర్వాత గ్రూప్ –1 ఫలితాలు
  • హైకోర్టులో టీజీపీఎస్సీ వాదనలు
  • పిటిషనర్లు, టీఎస్‌పీఎస్సీ వాదనలు విన్న హైకోర్టు

ముద్ర, తెలంగాణ బ్యూరో :గ్రూప్ –1 మెయిన్స్ పరీక్షలకు సిద్ధం చేశామని, ఇప్పటికే మెయిన్స్‌కు అభ్యర్థులను ప్రకటించామని, ఇలాంటి సమయంలో కోర్టు జోక్యం చేసుకోవడం కరెక్ట్ కాదంటూ టీజీపీఎస్సీ కోర్టుకు విజ్ఞప్తి చేసింది. గ్రూప్‌– 1 నోటిఫికేషన్‌పై హైకోర్టులో పిటీషన్లు దాఖలైన సంగతి తెలిసిందే. 2022లో జారీ చేసిన గ్రూప్‌–-1 నోటిఫికేషన్‌ను రద్దు చేయకుండా మరో నోటిఫికేషన్ జారీ చేయడం చెల్లదని దామోదర్‌రెడ్డితో పాటు వికారాబాద్, యాదాద్రి, హనుమకొండ, వరంగల్ జిల్లాలకు చెందిన మరో అయిదుగురు ఈ పిటీషన్‌లను దాఖలు చేశారు. తాజాగా నిర్వహించిన గ్రూప్‌ '1 ప్రిలిమ్స్‌' పరీక్ష ప్రాథమిక కీలో తప్పులున్నాయని, వాటిని సవరించాలన్న అభ్యంతరాలను సవాల్‌ చేస్తూ అభ్యర్థులు రెండు దరఖాస్తులు దాఖలు చేశారు. వీటిపై న్యాయమూర్తి పుల్లా కార్తీక్‌ విచారణ జరిగింది. విచారణ సమయంలో ప్రభుత్వం తరపు న్యాయవాది కీలక విషయాలను ధర్యాసనానికి తెలియజేశారు. గ్రూప్‌ 1 ప్రిలిమ్స్ పరీక్షల కీపై అభ్యంతరాలు స్వీకరించామని, వాటిని ఆయా సబ్జెక్ట్‌ల వారిగా నిపుణుల కమిటీకి పంపి, వారు ఆమోదించిన తర్వాత ఫలితాలు విడుదల చేసినట్లు టీజీపీఎస్సీ హైకోర్టుకు నివేదించింది. మెయిన్స్‌ క్వాలిఫై అయిన వారికి త్వరలో మెయిన్స్‌ పరీక్షలు జరగనున్నాయని. ఈ దశలో కోర్టులు జోక్యం చేసుకోరాదని, దీనివల్ల అభ్యర్థులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది రాహుల్‌రెడ్డి, టీజీపీఎస్సీ ఎం రాంగోపాల్‌రావులు వాదనలు వినిపించారు.

గ్రూప్‌– 1 పరీక్షలు రాసిన 3 లక్షల మంది నుంచి ప్రిలిమ్స్‌ కీపై భౌతికంగా 721, ఆన్‌లైన్‌లో 6,470 అభ్యంతరాలు వచ్చినట్లు న్యాయవాదులు తెలిపారు. వాటిని నిపుణుల కమిటీ పరిశీలించి, కొన్ని సిఫార్సులు చేసింది. వీటిని తీసుకుని రెండు ప్రశ్నలను తొలగించి విడుదల చేశామని వివరించారు. ప్రస్తుతం పిటిషన్ దాఖలు చేసిన ఐదుగురిలో ఒక్కరే కమిషన్‌కు అభ్యంతరాలు తెలియజేసినట్లు తెలిపారు. మిగిలినవారు ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకుండా కోర్టును ఆశ్రయించారు. రెండోసారి నోటిఫికేషన్ జారీని సవాల్ చేసిన అభ్యర్థితో పాటు కీని సవాల్ చేసిన పిటిషనర్లలో ముగ్గురు మెన్స్‌కు అర్హత సాధించినట్లు. ప్రశ్నలకు విశ్లేషణాత్మకంగా ఆలోచించి సమాధానం ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఒకరిద్దరికి అర్థం కానంత మాత్రాన అవి తప్పులైనట్లు కాదన్నారు. పరీక్షలను స్పష్టంగా నిర్ధారించామని, ఈ పిటిషన్లను కొట్టివేయాలని న్యాయమూర్తిని నిర్ణయించారు. గురు, శుక్రవారాల్లో కోర్టులో వాదనలు జరిగాయి. శుక్రవారం వాదనలు విన్న తర్వాత కోర్టు తీర్పును రిజర్వు చేసింది.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Page Perfect Tech

Partners:
georgia escort | escort georgia | tbilisi escort | batumi escort | georgia escort blog | escort georgia ads | georgia escort listings