hacklink al hack forum organik hit kayseri escort istanbul escortbakırköy escortataköy escortkadıköy escortşişli escorteskortistanbul escort bayanataşehir escortjojobetzlibrarytravesti escortgrandpashabetgamdomCasinomaxihipbetgrandbettingSoft2betbuca escortSolana Trading Bottosple.comdeneme bonusu veren sitelerSweet BonanzaSekabetbettiltbayspinBetsatjojobet 1023 com girisdeneme bonusukumar siteleriverabet girişbetzula girişextrabetpulibet girişkolaybetcasibomSonbahis466marsbahismatbetbetgarantimatadorbetextrabetslot siteleribettilt girişbetmatik girişmatbetperabetperabet giriştipobet girişcasibomalobetmarsbahissahabetjojobetstarzbetbetcoolbetcoolbetciokumar sitelericasibomcasibom girişNight club kıbrısNight club kıbrısjojobet girişmadridbet girişonwinjojobet girişjojobet giriş1xbetkingroyalpadişahbet güncel girişpadişahbet güncel girişsüperbahisantalya escortporn sexdeneme bonusutürk porno türk ifşa porno türk türk porno izle porno izle hd porno türk sikis türk seks video türk ifşa telegram telegram porno telegram onlyfans ücretsiz porno sikiş porno indir konulu porno mobil porno seks filmi pormo mobil porno izleankara escortjojobettürk ifşatokyo horei
Home తెలంగాణ అధిక వడ్డీలకు అప్పులు తేం – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana News

అధిక వడ్డీలకు అప్పులు తేం – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana News

by Prajapalana
0 comments
అధిక వడ్డీలకు అప్పులు తేం - తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్

[ad_1]

  • ప్రజల నెత్తిన పెను భారం మోపం
  • రాష్ట్ర అప్పులను రీ స్ట్రక్చర్ చేయించే ప్రయత్నం చేస్తున్నాం
  • తక్కువ వడ్డీలతోనే రాష్ట్రానికి అవసరమైన నిధులను సమకూర్చుకుంటాం
  • అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తాం
  • ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటాం
  • ప్రజా పాలనలో దేశానికే తెలంగాణాను రూల్ మోడల్ గా నిలుపుతాం
  • గోల్కొండ కోటలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి

ముద్ర, తెలంగాణ బ్యూరో :-గత ప్రభుత్వం మాదిరిగానే అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి ప్రజల నెత్తిన మోయలేని భారాన్ని మోపమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తక్కువ వడ్డీలతోనే రాష్ట్రానికి అవసరమైన నిధులు సమకూర్చుకుంటామన్నారు. ప్రస్తుతమున్న రాష్ట్ర అప్పులను రీ స్ట్రక్చర్ చేయించే ప్రయత్నం చేస్తున్నాం. రాష్ట్ర ఆర్థిక స్థితి సరిగ్గా లేనప్పటికీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటామన్నారు.

అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తామన్నారు. అలాగే ప్రజా పాలనలో దేశానికే తెలంగాణాను రూల్ మోడల్ గా నిలబెట్టామన్నారు.గోల్కొండ కోటలో జరిగిన స్వాతంత్ర్య దినోత్స వేడుకల్లో….ముందుగా ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో కాంగ్రెస్ – ప్రభుత్వం చేపట్టేనాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా విధ్వంసమై అధికారం. గత పది సంవత్సరాలలో రాష్ట్ర ప్రభుత్వ అప్పు దాదాపు 10 రెట్లు పెరిగింది. రాష్ట్ర ఆవిర్భావ సమయంలో రూ.75,577 కోట్లగా ఉన్న అప్పు, గత ఏడాది డిసెంబరు నాటికి దాదాపు రూ. 7 లక్షల కోట్లకు చేరిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒప్పందం శ్వేతపత్రం కూడా విడుదల చేశామన్నారు. దయనీయ స్థితిలో ఉన్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు స్వస్థత చేకూర్చడం కోసం ఆర్థిక పునరుజ్జీవనం అవసరం అని భావించాం. అందుకే అనేక వినూత్న నిర్ణయాలు తీసుకున్నామన్నారు.

ఇందులో భాగంగానే ఇటీవల తన అమెరికా పర్యటనలో ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడితో సమావేశమైనట్లు వివరించారు. తక్కువ వడ్డీతో రాష్ట్రాభివృద్ధికి అవసరమైన నిధులు సమకూర్చుకునే అంశంపై తమ మధ్య సానుకూల చర్చలు జరిగాయి. రాష్ట్రంలో పదేళ్ల నిరంకుశ పాలనకు చెరమగీతం రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్‌కు అవకాశం కల్పించారు. ఈ సందర్భంగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన అందిస్తామన్నారు.

నాటి బ్రిటీషు దాస్య శృంఖలాల నుండి దేశం ఏ విధంగా ఐతే విముక్తి చెందిందో… అదే స్ఫూర్తితో, అదే పోరాట పటిమతో అంతిమ పోరాటం చేసి డిసెంబర్ 3, 2023న స్వేచ్ఛను, స్వాతంత్య్రాన్ని తెచ్చుకున్నామన్నారు. ప్రస్తుతం

ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలే ఎన్నుకున్న ప్రజా ప్రభుత్వం కొలువై ఉంది. తొలి సారి రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధ పాలన జరుగుతోందని. గడచిన పదేళ్లుగా తెలంగాణ కోల్పోయిన స్వేచ్ఛను పునరుద్ధరించడమే తమ ప్రభుత్వ తొలి ప్రాధాన్యతగా భావించామన్నారు. భౌతికంగా ఉన్న కంచెలు తొలగించడమే కాదు… మానసిక బానిసత్వ సంకెళ్లు తెంచేశామన్నారు. పాలకులు తప్పు చేస్తే నిలదీసే స్వేచ్ఛ ఈ రోజు తెలంగాణలో. పరిపాలనలో లోటుపాట్లు ఉంటే సూచనలు, సలహాలు స్వీకరించే సౌలభ్యం కల్పించామన్నారు. ప్రతి నిర్ణయంలో ప్రజాహితాన్ని చూస్తున్నాను.

లోతైన సమీక్షలతో మంచి చెడులను తెలియజేసి… మెజారిటీ వర్గాల ప్రయోజనాలే ప్రామాణికంగా పాలన చేస్తున్నాం.ఇంతటి వ్యవస్థలో తప్పులు జరిగితే సరిదిద్దుకుంటున్నామని ఎవరైనా తప్పుడు ఆరోపణలు చేసినప్పటికీ సంయమనం పాటిస్తున్నామన్నారు. ఇది ప్రజాస్వామ్యం అన్న స్పృహ, స్ఫూర్తితో పాలన చేస్తున్నామన్నారు.ఎన్నికల సందర్భంలోనే చెప్పామని…. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఏడో గ్యారెంటీగా ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తామన్నారు. ఈ రోజు అక్షరాలా అది చేసి చూపిస్తున్నాము.ప్రజలందరికీ సామాజిక న్యాయం, సమాన అవకాశాలు కల్పించాలన్నది తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు.

బాధ్యతలు స్వీకరించిన 48 గంటల్లోనే…..

ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం కుదురుకోక ముందే…. ఆర్థిక పరిస్థితిని అంచనా వేసుకోక ముందే హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో రెండు గ్యారెంటీల అమలు చేశామన్నారు. బాధ్యతలు స్వీకరించిన కేవలం 48 గంటల్లోనే రెండు గ్యారెంటీల అమలు ప్రారంభించి చరిత్ర సృష్టించామన్నారు. ఆడబిడ్డలకు తొలి ప్రాధాన్యత ఇస్తూ… ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించామన్నారు. ఈ పథకం ద్వారా జూలై ఆఖరు నాటికి మహిళలకు రూ. 2,619 కోట్ల మేర ఆదా చేయగలిగాం అని గర్వంగా చెబుతున్నానని అన్నారు.

ఇక రాష్ట్రంలో వైద్యం అందక ఏ ఒక్కరూ ప్రాణాలు కోల్పోకూడదన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ ఆశయమన్నారు. రాష్ట్రంలో నిరుపేద సైతం ఆసుపత్రికి ఖరీదైన వైద్యాన్ని పొందాలన్న లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆరోగ్యశ్రీ కి పూర్వవైభవాన్ని తెచ్చే ప్రయత్నం చేశామన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందని…. దీనిని మరింత పటిష్టంగా అమలు చేసేందుకు ఆరోగ్యశ్రీ కింద 5 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయల వరకు అందించే వైద్యచికిత్సల పరిమితిని ప్రకటించారు.

కొత్తగా 163 చికిత్సలను ఈ పథకంలో చేర్చామన్నారు. మొత్తం 185 చికిత్సలకు 10 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం అందుతుంది. అలాగే ఆరోగ్యశ్రీ ప్యాకేజీల ధరలను 20 శాతం పెంచామన్నారు. అవయవ మార్పిడి సహా ఆధునిక చికిత్సలను అందుబాటులోకి తీసుకువచ్చారు. రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఆరోగ్యశ్రీ పథకం అమలు చేయాలని నిర్ణయించామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆస్పత్రులను ఆధునీకరించి, విస్తృత వైద్యసేవలు ప్రభుత్వ కృతనిశ్చయంతో ప్రదర్శన. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ప్రత్యేక గుర్తింపు సంఖ్యగల డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డు జారీచేసే విధానాన్ని త్వరలో ప్రారంభిస్తామన్నారు. పౌరుల ఆరోగ్య సంబంధిత సమాచారం ఒకే చోట ఉండి, సులభంగా రోగనిర్ధారణ, సత్వర చికిత్సలకు వీలు కల్పించేందుకే ఈ ఆలోచన చేశామన్నారు.

రూ. 500కే వంటగ్యాస్ సిలెండర్

ఆడబిడ్డల కన్నీళ్లు తుడవాలన్న లక్ష్యంతో ప్రారంభించిందే మహాలక్ష్మీ పథకంలోని మరో పథకం రూ. 500లకే వంట గ్యాస్ ఇవ్వాలన్న ఆలోచన అన్నారు. 2014లో కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయే నాటికి గ్యాస్ బండ ధర రూ. 410 ఉండగా… పదేళ్లలో దానిని రూ. 1200లకు పెంచారు. అందుకే తిరిగి దాన్ని రూ. 500కే ఇవ్వాలన్న సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఫిబ్రవరి, 27న ప్రారంభించామన్నారు. 40 లక్షల మంది లబ్ధిదారులతో మొదలైన ఈ పథకం… ప్రస్తుతం 43 లక్షల మందికి లబ్ధి చేకూర్చుతోంది. సబ్సిడీ కింద లబ్ధిదారులు ఉపయోగించిన 85 లక్షల 17 వేల 407 సిలిండర్లకు గాను 242 కోట్ల రూపాయలు చెల్లించారు. అలాగే అల్పాదాయ వర్గాల వారికి విద్యుత్ బిల్లుల భారం తగ్గించడం కోసం గృహజ్యోతి పథకం అమలు చేస్తున్నామన్నారు. ఈ పథకం కింద 200 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ వాడే ప్రతి ఇంటికి ఉచిత వెలుగులు పంచుతున్నామన్నారు. భద్రాద్రిలో పరమ పవిత్రమైన శ్రీరాముని సన్నిధిలో ఈ శ్రీకారం చుట్టామన్నారు. ఈ పథకం ద్వారా కనీసం 3,500 ఇళ్ళ చొప్పున ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 4,50,000 ఇళ్ల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.

రూ.2 లక్షల వరకూ రుణ మాఫీ

తమ ప్రభుత్వ ఎజెండాలో వ్యవసాయరంగం అత్యంత ప్రాధాన్యతగా ఉందని రేవంత్ రెడ్డి వివరించారు. అందుకే ఇటీవల బడ్జెట్ లో వ్యవసాయ, అనుబంధ రంగాలకి భారీ మొత్తంలో రూ. 72,659 కోట్లు కేటాయించారు. ఈ నేపథ్యంలోనే దేశంలో ఎక్కడా జరగని విధంగా రైతన్నలకు రెండు లక్షల రూపాయల వరకు ఏకకాలంలో రుణమాఫీని విజయవంతంగా పూర్తి చేశామన్నారు. ఇది అసాధ్యమని చాలా మంది వక్రభాష్యాలు చెప్పారు. కానీ తమ ప్రభుత్వం మాట ఇచ్చిన ప్రకారం రైతన్నలకు రూ.2 లక్షల వరకూ ఏక కాలంలో రుణ మాఫీ అమలు చేసి చూపిస్తున్నాము. ఈ పథకంలో అర్హులైన ప్రతి రైతుకు న్యాయం జరుగుతాయి.

దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజే… రాష్ట్ర రైతుకు ఆర్థిక స్వాతంత్ర్యం వచ్చిందని ఘనంగా చెప్పుకునే రోజు. ఈ కార్యక్రమంతో మా జన్మ ధన్యమైందని భావిస్తున్నాము. రైతులకు కావలిసిన ఉత్పత్తులు, విత్తనాలు ప్రాథమిక సహకార పరపతి సంఘాల ద్వారా పంపిణీ చేస్తున్నామన్నారు. ఈ ఏడాది వానాకాలం పంటకు జూలై 24న 11.85 లక్షల మెట్రిక్ టన్నులు పంపిణీ చేశామన్నారు. ఇంకా 10.65 లక్షల మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉన్నాయి.

రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని విశ్వసించే ప్రభుత్వం తమదన్నారు. అర్హులైన రైతులకు రైతు భరోసా నిధికి 15 వేల రూపాయల చొప్పున అందించాలన్నది ప్రభుత్వ సంకల్పమన్నారు. గతంలో అమలు చేయబడిన రైతు బంధు పథకం కింద ఏకరాకు సంవత్సరానికి రూ. 10 వేలు మాత్రమే చెల్లించారు. అది కూడా అనర్హులకు, సాగులో లేని భూమి యజమానులకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కూడా లబ్ధి చేశారన్నారు. దీనివల్ల ప్రభుత్వ ధనం దుర్వినియోగం కావడమే తప్ప రైతు ప్రయోజనాలు నెరవేరుతాయి. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా సక్రమంగా అమలు చేయాలన్న లక్ష్యంతో విధివిధానాలు రూపొందిస్తున్నాయి. దీనికోసం ప్రభుత్వం వర్గ ఉప సంఘాన్ని నియమించింది.ఈ ఉప సంఘం రాష్ట్ర వ్యాప్తంగా రైతులు, రైతు సంఘాలు, రైతు కూలీలు, మేధావుల నుంచి అభిప్రాయాలను సేకరించారు. వాటిని పరిగణలోకి తీసుకుని విధి విధానాలు రూపొందించి త్వరలో రైతు భరోసా పథకం ప్రారంభించబోతున్నాం.

రైతులకు పంటలబీమా పథకం వర్తింపజేయడానికి ఈ సంవత్సరం నుంచి ఫసల్ బీమా పథకంలో చేరాలని నిర్ణయించారు. ఈ పథకం కింద రైతుల బీమా ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది. రైతులకు పైసా ఖర్చు లేకుండా పంటలకు పూర్తి భద్రత కలుగుతుంది. రైతులకు ఆధునిక సాంకేతిక విధానాలు, పంటలబడికి సంబంధించి శాస్త్రీయ పద్ధతులను తెలియజేయడానికి “రైతు నేస్తం” ప్రారంభించామన్నారు.

దరణిపై స్పెషల్ నజర్

రైతుల పాలిట శాపంగా మారిన ధరణి సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టిందని రేవంత్ అన్నారు. ధరణి అమలులో అవకతవకలు, లోపభూయిష్ట విధానాల కారణంగా రైతులకు ఎంతో కష్టం కలిగింది. ఈ సమస్యల పరిష్కారానికి 2024 మార్చి 1 నుంచి 15 వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించామన్నారు.ఈ సమస్యల పరిష్కారం, పరిష్కారం చేయలేనివి దరఖాస్తు చేసుకున్నట్లయితే తిరస్కరిస్తే దానికి గల కారణాలను తప్పకుండా నమోదు చేయాలని ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న ధరణి దరఖాస్తులను పరిష్కరించాలని కోరాం… భూ సమస్యల పరిష్కారానికి సరికొత్త సమగ్ర చట్టం తీసుకురావాలని కోరుతున్నాం.

మదక ద్రవ్యాల పై ఉక్కుపాదం

నేరం రూపం మార్చుకుంది. సైబర్ నేరాలు, డ్రగ్స్ మహమ్మారి సమాజాన్ని పట్టి పీడిస్తున్నవి. ఈ నేరాల వల్ల వ్యక్తులు కాదు… మొత్తం జాతే నిర్వీర్యం అయ్యే ప్రమాదం పొంచి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఆందోళనకరమైన అంశమన్నారు. అందుకే రాష్ట్రంలో డ్రగ్స్ మాట వినపడకూడదని, కనపడకూడదని కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నామన్నారు. డ్రగ్స్ నియంత్రణ, నివారణకు జీరో టాలరెన్స్ పద్ధతిని ఉపయోగిస్తున్నామన్నారు. తెలంగాణ మదక ద్రవ్య నిరోధక సంస్థ (టీ-న్యాబ్)ను బలోపేతం చేశామన్నారు. సైబర్ మోసాలు, నేరాల బారిన పడిన వారికి సత్వర సహాయం అవసరం 1930 నెంబర్ 24 గంటలు పని చేసే కాల్ సెంటర్ ఏర్పాటు చేశాం.

విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు

రాష్ట్రంలో విద్యావ్యవస్థను ఏర్పాటు చేయడానికి త్వరలో విద్యా కమీషన్ నిర్ణయించబడింది. అంగన్వాడి లను ప్రీ ప్రైమరీ స్కూళ్లుగా మార్చబోతున్నామని ప్రాథమిక పాఠశాలలు మొదలు విశ్వవిద్యాలయాల వరకు నాణ్యమైన విద్యాబోధన, నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పనకు ఒక మిషన్ మోడ్‌లో సంకల్పించబడింది. పాఠశాలలు తెరిచిన రోజునే పిల్లలందరికీ యూనిఫారాలు, పాఠ్యపుస్తకాలు అందజేశామన్నారు. అమ్మ ఆదర్శపాఠశాలల కమిటీల ద్వారా మౌలిక వసతులు కల్పిస్తున్నామనే్నరు. 65 ప్రభుత్వ ఐ.టి.ఐ లను టాటా సంస్థల సహకారంతో కేంద్రాలుగా మారుస్తున్నామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థుల కోసం ప్రతి నియోజకవర్గంలో ఒకే ఆవరణలో 25 ఎకరాల స్థలంలో ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూళ్లను నిర్మించబోతున్నామని రేవంత్ రెడ్డి వివరించారు.

యువతకు ఉద్యోగావకాశాలు

అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే 30 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశామన్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ను ప్రక్షాళన చేసి, ఇప్పటికే గ్రూప్-1 ప్రాథమిక పరీక్షను విజయవంతంగా నిర్వహించామని, 11,062 టీచర్ గ్రూప్ పోస్టుల భర్తీకి డీఎస్సీని విజయవంతంగా నిర్వహించామన్నారు.ఉద్యోగ నియామకం వయోపరిమితిని కూడా 44 ఏళ్ల నుంచి 46 ఏళ్లకు చేర్చామని.గ్రూప్-1, గ్రూప్-2,-3 నియామకాలకు ఉన్న కోర్టు చిక్కుముళ్లను పరిష్కరించామన్నారు. ఇటీవలే శాసనసభలో జాబ్లెండర్ ను ప్రవేశ పెట్టామన్నారు. దాని ప్రకారం పోటీ పరీక్షలు నిర్వహించి ప్రతి ఏటా ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయబోతున్నాం.రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు స్పష్టమైన హామీ ఇస్తున్నామని…. మీ సమస్యలు ఏమైనా ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలన్నారు. వాటిని పరిష్కరిస్తే తాము బాధ్యత తీసుకుంటాం. చెప్పుడు మాటలు విని మీ భవిష్యత్తును చెడగొట్టుకో వద్దు అని హితవు పలికారు. ఎవరి ఉద్యోగాల కోసమో…మీ జీవితాలను బలి చేసుకోవద్దన్నారు.

[ad_2]

You may also like

Leave a Comment

Subscribe my Newsletter for new blog posts, tips & new photos. Let's stay updated!

Facebook Twitter Youtube Linkedin Envelope Rss

Useful Links

Edtior's Picks

కొండా సురేఖ కామెంట్స్ పై సమంత స్ట్రాంగ్ రియాక్షన్… – Prajapalana News డబుల్ బెడ్ రూం.. 25 వేల నగదు – మూసీ నిర్వాసితులకు సర్కార్ సెటిల్మెంట్ – తాజా... హీరోయిన్ల జీవితాలతో కేటీఆర్ ఆడుకున్నడు – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్...

Latest Articles

కొండా సురేఖ కామెంట్స్ పై సమంత స్ట్రాంగ్ రియాక్షన్… – Prajapalana News డబుల్ బెడ్ రూం.. 25 వేల నగదు – మూసీ నిర్వాసితులకు సర్కార్ సెటిల్మెంట్ – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana హీరోయిన్ల జీవితాలతో కేటీఆర్ ఆడుకున్నడు – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana News కేటిఆర్ వ్యాఖ్యలపై మంత్రి సీతక్క తీవ్ర ఆగ్రహం – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana News

All Right Reserved. Designed and Developed by Page Perfect Tech

Partners:
georgia escort | escort georgia | tbilisi escort | batumi escort | georgia escort blog | escort georgia ads | georgia escort listings